ప్రముఖ నిర్మాతపై కేసు..?

మధుర గాయకుడైన గుల్షన్‌ కుమార్‌ పెద్ద కొడుకు, నటి దివ్యా ఖోస్లా భర్త భూషణ్‌ కుమార్‌ పై అత్యాచార కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. భూషణ్‌ కుమార్‌(43) ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ టీ సిరీస్‌ కు చైర్మన్‌ కమ్‌ ఎండీగా కొనసాగుతున్నాడు. అయితే 2017లో తన అప్‌కమింగ్‌ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్‌ తనపై అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు(30) ఆరోపిస్తోంది.

మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొంటూ ముంబైలోని అంధేరీ డీఎన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో భూషణ్‌ కుమార్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాల్సి ఉంది. అయితే దీనిపై భూషణ్‌ ఇప్పటిదాకా స్పందించలేదు. మూడేళ్లపాటు దీనిపై ఆ మహిళ ఎందుకు కంప్లెయింట్ చెయ్యలేదు అనేదానిపై కూడా విచారణ జరుగుతోంది.