ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పౌరాణిక, చారిత్రక, ఇతిహాస, జానపద సినిమాలు ఎక్కువయ్యాయి. వీటిని భారీ బడ్జెట్తో తీస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇదే కోవలో ఇప్పుడు మరో పెద్ ప్రాజెక్టు సీత షూటింగ్కు రెడీ అవుతోంది. రామాయణంలో సీత క్యారెక్టర్ వెర్షన్ లో ఈ సినిమా స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ సీత పాత్రను చేయబోతోంది.
ఇక ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడంతో హైప్ పెరిగింది. కాగా కరీనా కపూర్ ఈ సినిమా చేయాలంటే విజయేంద్ర ప్రసాద్ కు రెండు షరతులు పెట్టిందని తెలుస్తోంది. ఒకటి సీత చేసే కంటే ముందే తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేస్తానని చెప్పిందంట. అలాగే తనకు రెమ్యునరేషన్ రూ. 12 కోట్లు ఇవ్వాలని మరో కండీషన్ పెట్టిందంట. విశేషం ఏంటంటే ఈ రెండు షరతులకు మూవీ టీం ఒప్పుకుందట. అలౌకిక్ దేశాయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.