టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా, ఫాహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప విడుదలపై ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దాని ప్రకారం.. పుష్ప మొదటి భాగాన్ని ఏ ఏడాది దసరా బరిలో దింపాలని మేకర్స్ భావిస్తున్నారట. కరోనా సెకెండ్ వేవ్కు ముందే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న పుష్ప.. జూలై నెల మొదటివారం నుంచి మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనుందట.
ఇక నెలాఖరుకి షూటింగు పార్టును కంప్లీట్ చేసేసి.. మిగిలిన పనులను ఆగస్టు నెలలో పూర్తి చేయనున్నారట. ఆ వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. దసరాకు సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. మరి నిజంగానే పుష్ప దసరాకు విడుదలైతే.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.