నందమూరి బాలకృష్ణ తనముడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అదుగో ఇదుగో అంటున్నారు కానీ, మోక్షజ్ఞ మాత్రం కెమెరా ముందుకు రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై రియాక్ట్ అయిన బాలయ్య ఓ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పారు.
తాజాగా ఓ మీడియా ఛానల్తో మాట్లాడినా బాలయ్య.. తన సినిమాలతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మోక్షజ్ఞ ను ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నట్టు తెలిపిన బాలయ్య.. తాను నటించిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్గా మోక్షజ్ఞ సినిమా రానుందని బాలయ్య చెప్పారు.
అంతేకాదు ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారని సమాచారం.