తెలంగాణ‌లో క్షీణిస్తున్న క‌రోనా జోరు.. తాజా కేసులెన్నంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు.

ఇక తెలంగాణ‌లోనూ విశ్వ‌రూపం చూపించిన క‌రోనా .. ప్ర‌స్తుతం కంట్రోల్‌లోకి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా క్షీణిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 5,91, 170 కి చేరింది.

నిన్న క‌రోనాతో 14 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,378 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 3,614 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 5,60,776 కు చేరుకుంది. ఇక ప్ర‌స్తుతం రాష్ట్రంలో 27,016 మంది చికిత్స పొందుతున్నారు.