ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా కేసులు నిన్న భారీగా తగ్గగా.. మరణాలు స్వల్పంగా పెరిగాయి.
గత 24 గంటల్లో భారత్లో 1,20,529 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,94,879 కు చేరుకుంది. అలాగే నిన్న 3,380 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,44,082 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 1,97,894 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 2,67,95,549 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 15,55,248 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.