విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో దృశ్యం 2 రీమేక్ ఒకటి. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ నే తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. మీనా, కృతికా జయకుమార్, ఎస్తర్ అనిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.
ఇటీవలె ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. ఇక మరోవైపు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న నారప్ప షూటింగ్ కూడా పూర్తి అయింది. కానీ, ప్రస్తుత కరోనా సమయంలో ఈ రెండు చిత్రాలు థియేటర్కు వచ్చే పరిస్థితి లేదు. అయితే విడుదలకు ఆలస్యం అవుతుండటంతో వెంకీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓటీటీ ద్వారా దృశ్యం 2 సినిమాను రిలీజ్ చేసి.. థియేటర్లు తెరుచుకున్న తరువాత నారప్పను రిలీజ్ చేస్తే బాగుంటుందనే వెంకీ భావిస్తున్నారట. మరి వెంకీ నిర్ణయాన్ని సురేష్ అంగీకరిస్తారా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.