నటుడు సోనూసూద్ ఇప్పుడు చాలా మందికి దేవుడయ్యాడు. సినిమాల్లో విలన్ గా నటిస్తూ హీరో చేతిలో దెబ్బలు తినే సోనూసూద్ ఇప్పుడు నిజజీవితంలో హీరోగా మారాడు. అతడు గతేడాది తన సొంత ఖర్చుతో వలస కార్మికుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతో మందికి సేవ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎవరికి ఏ సాయం కావాలన్నా సోనూసూద్ గుర్తుకు వస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. అయితే సోనూసూద్ చేస్తున్న సేవను, గొప్ప పనులను చూసి యశ్వంత్ అనే కళాకారుడు ఇంప్రెస్ అయ్యాడు. నోటితో పెయింట్ బ్రష్ పట్టుకొని సోనూసూద్ చిత్రాన్ని అద్భుతంగా గీసాడు.
మీ సేవా కార్యక్రమాలు, మీ సేవ చేసే గుణం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటూ.. యశ్వంత్ తను బొమ్మ గీసిన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన సోనూసూద్ ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా కలుస్తానంటూ ట్వీట్ చేశాడు. సోనూసూద్ ట్వీట్తో కళాకారుడు యశ్వంత్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. కాగా, సోనూసూద్ ఇటీవల ఆక్సిజన్ సిలిండర్లు పంపి ఏకంగా 22 మంది ప్రాణాలను కాపాడాడు. తాజాగా తన టీం ను పంపి 30 మంది కరోనా రోగుల ప్రాణాలు నిలిచేలా చేశాడు.
Sir @SonuSood ❤
You are the one who have inspired many like me with your selfless work,helping thousands of people.
I'm one such admire,paying tribute to you with this beautiful painting.I would like to meet you and present this to you sir❤#sonusood #SonuSoodRealHero #SonuSood pic.twitter.com/NNS9v9cwZa— Artist Yaswanth (@YaswanthArtist) May 14, 2021