శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా వివాదం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాకే డైరెక్టర్ శంకర్ తన కొత్త ప్రాజెక్టు షూటింగ్ స్టార్ట్ చేయాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను జూన్ కు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్ మరో దారిలో ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేసే వరకు శంకర్ మరో కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టకుండా చూడాలని తెలుగు, హిందీ ఫిల్మ్ఛాంబర్స్ కు లేఖ రాసినట్టు సమాచారం. ఓ వైపు శంకర్ ఇప్పటికే రామ్చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమాతో పాటు ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ ని రణ్వీర్సింగ్ తో తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన తర్వాతే ‘ఇండియన్ -2’ సినిమా వివాదం మరింత ముదిరింది. లైకా ప్రొడక్షన్ సంస్థ ఇలానే అడ్డుపడితే రామ్చరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశముంది.