ఆ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సింగర్..!

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవిడ తన అందమైన పాటలతో ఎంతో మంది ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈమెకు ముక్కుసూటి అమ్మాయిగా పేరు కూడా ఉన్న సంగతి అందరికి విదితమే. ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ సమాజంలో జరిగే వాటిపై, అలాగే మహిళల భద్రత విషయంలో ఎన్నో సూచనలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.ఐతే చిన్మయి బ్లడ్ డొనేషన్ గురించి సోషల్ మీడియా ద్వారా ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది. కరోనా వైరస్ కారణంతో ప్రజలు వాక్సినేషన్ వేయించుకున్న సంగతి అందరికి విదితమే.. ఇక వ్యాక్సినేషన్ తీసుకున్న అనంతరం బ్లడ్ డొనేషన్ గురించి అందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్ గా తెలియజేసింది చిన్మయి. “ఎవరైనా సరే వ్యాక్సినేషన్ తీసుకున్న అనంతరం 56 బ్లడ్ డొనేట్ చేయకూడదని, ఇలా చేయడంతో ముందు ముందు బ్లడ్ బ్యాంకులో బ్లడ్ అందుబాటులో లేకుండా పోతుందని” పేర్కొంది చిన్మయి. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.