పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గాయ‌ని శ్రేయ‌ ఘోషల్!

సంగీత ప్ర‌పంచంలో ఎన్నో సంచ‌నాలు సృష్టించి దేవ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న‌ ప్ర‌ముఖ గాయ‌ని శ్రేయ ఘోష‌ల్ ఇటీవ‌ల తాను త‌ల్లి కాబోతున్న విష‌యాన్ని అభియానుల‌తో పంచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈమె పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. శ్రేయ‌కు ఇదే తొలి కాన్పు.

ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. దేవుడు మమ్మల్ని ఓ మగబిడ్డతో దీవించాడు. ఇలాంటి ఉద్వేగాన్ని మునుపెన్నడూ చవిచూడలేదు. శిలాదిత్య, నేను, ఇతర కుటుంబ సభ్యులు ఈ మధుర క్షణాల్లో ఉప్పొంగిపోతున్నాం.

అభిమానుల అశేష దీవెనలకు కృతజ్ఞతలు అంటూ శ్రేయా తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఆమెకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, 2015లో శ్రేయా తన చిరకాల బాయ్ ఫ్రెండ్ షీలాదిత్య ను వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.