కరోనా కారణంలో ఈసారి ఐపిఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో కూడా బీసీసీఐ వెనకడుగు వేయలేదు. ఇంగ్లండ్ లో ఐపీఎల్ ను పెట్టడానికి సన్నద్దమవుతోంది. మరో వైపు న్యూజిలాండ్తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన నెల తరువాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నిర్వహించడానికి ప్రణాళికలు వేసింది. ఇప్పుడు శ్రీలంక పర్యటన కోసం మరో టీంను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే మరోక వన్డే జట్టును శ్రీలంక పర్యటనకు పంపనుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు విరాట్కోహ్లి సారథ్యంలో టీమిండియా ఈ నెల 29 న ఇంగ్లండ్కు పయనమవనున్నారు. అయితే భారత వన్డే జట్టుకు కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండడు. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంకతో జరిగే మ్యాచులకు రాహుల్ ద్రవిడ్ను హెడ్ కోచ్గా పంపాలని బీసీసీఐ భావిస్తోంది. భారత్, లంక మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్లు జరుగుతాయి. జూలై 13, 16, 19 తేదీల్లో వన్డేలు, జూలై 22, 24, 27 తేదీల్లో టి20 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఈ టీమ్ కు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ అందుబాటులో ఉండనున్నాడు.