పుదుచ్చేరి సీఎంకి కరోనా పాజిటివ్..!

కరోనా వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా చాలా మంది సీనియర్‌ రాజకీయ నేతలు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. గతంలో కొందరు సీఎంలకు కూడా కరోనా రావడం కలకలం రేపింది. తాజాగా పుదుచ్చేరికి ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సీఎం ఎన్ రంగస్వామి కరోనా బారిన పడ్డారు. మొన్నటికి మొన్న మే 7వ తేదీన సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజులకే కరోనా బారిన పడటంతో కార్యకర్తలు, సన్నిహితులలో ఆందోళన నెలకొంది.

ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పుదుచ్చేరి సీఎంకు పరీక్షలు నిర్వహించగా అందులో ఆయనకు కరోనా పాజిటివ్ గా వచ్చింది. వైరస్ బారిన పడ్డ రంగసామి చెన్నై లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా వచ్చిన విషయాన్ని మీడియాకు తెలియజేశారు. రంగసామి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉందని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు.