టీమిండియా లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన అతని తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా కరోనా పోరాడిన పీయూష్ తండ్రి చివరకు మహమ్మారికి బలైయ్యారు. ఈ విషయాన్ని పీయూష్ చావ్లా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. నాన్న లేకుండా మిగతా జీవితం గతంలోలా ఉండదని, ఈ రోజు తన మూల స్తంభంను కోల్పోయా అని పీయూష్ చావ్లా ట్వీట్ చేశాడు.
‘ఈ విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది. నా ప్రియమైన నాన్న మిస్టర్ ప్రమోద్ కుమార్ చావ్లా ఈ రోజు చనిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మీరు ఇచ్చిన మద్దతు మరువలేనిది. నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చావ్లా తన తండ్రి చిత్రంను షేర్ చేసి ఇలా తెలిపాడు. విషయం తెలుసుకున్న సహచర ఆటగాళ్లు, అభిమానులు పీయూష్ చావ్లాకు సంతాపం ప్రకటిస్తున్నారు.
Indian leg-spinner Piyush Chawla's father Pramod Kumar Chawla passes away after battling #COVID19, He was 60. pic.twitter.com/8dWXopUucO
— Doordarshan Sports (@ddsportschannel) May 10, 2021