యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు.
ఎన్టీఆర్ కెరీర్తో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో చేయనున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. నేటు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన ఉంటుందని అందరూ భావించారు.
అయితే అనుకున్నట్టుగానే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. తారక్కు బర్త్డే విషెస్ తెలుపుతూ ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. ఇక వీరి కాంబోలో తెరకెక్కబోయే ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితంకానుంది.
https://twitter.com/prashanth_neel/status/1395274100080218115?s=20