కంటతడి పెట్టిన పిఎం మోడీ..ఎందుకుంటే..?

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ అందక కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ పరిస్థితులను చూసి ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసాలను కృషిని అభినందించారు. కోవిడ్ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్ బలి తీసుకుంది. వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. డాక్టర్లు, ఇతర మొదటి శ్రేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారు’’ అని మోదీ అన్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 కరోనా కేసులు నమోదు కాగా, 4,209 మంది కరోనాతో మృతి చెందారు.