బ‌తికే ఉన్నా..మ‌ర‌ణ వార్త‌ల‌పై స్పందించిన ప్ర‌ముఖ‌ న‌టుడు!

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు పరేష్ రావల్ మృతి చెందిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. శుక్ర‌వారం ఉదయం 7 గంటలకు ఆయన కన్నుమూశారని వార్తలు వైర‌ల్ అయ్యాయి. దీంతో నెటిజ‌న్లు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కామెంట్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశారు.

అయితే ఈ వార్త ప‌రేష్ రావ‌ల్ చెంత‌కు చేర‌డంతో.. ఆయ‌న నవ్వుకోవడమే కాకుండా ట్విట్టర్ వేదికగా చమత్కారంగా రియాక్ట్ అయ్యారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించాలి.. నేను బ‌తికే ఉన్నా.. ఉదయం 7గంటలకు నేను నిద్రపోతూ ఉన్నాను అంటూ పరేష్ రావల్ రిప్లయ్ ఇచ్చారు.

మ‌ర‌ణ వార్త‌లపై ఆయ‌న రియాక్ట్ అయిన తీరుకు ప‌లువురు ప్ర‌శంస‌లు క‌రిపిస్తున్నారు. కాగా, చిరు హీరోగా తెర‌కెక్కిన శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో లింగం మామ పాత్ర ద్వారా ప‌రేష్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు.