టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పారు. ఇటీవల ఎన్టీఆర్ కరోనా బారిన సంగతి తెలిసిందే. విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్.. హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు.
అయితే తాజాగా ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. టెస్టు చేయించుకోగా కరోనా నెగటివ్గా తేలింది. నాకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్లకు మరియు నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
మరో ట్వీట్లో.. కరోనా చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. అలాగే, జాగ్రత్తలు, సానుకూల దృక్పథంతో ఈ వ్యాధిని జయించవచ్చు. దీనిపై పోరాటంలో మన సంకల్ప బలమే మన అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి.. భయపడకూడదు. మాస్కులు ధరించండి.. ఇంట్లోనే ఉండండి అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. మెత్తానికి ఈయన కరోనా నుంచి కోలుకోవడంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.