పూజా హెగ్డే.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన పూజా.. ప్రస్తుతం తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, తమిళంలో విజయ్ దళపతి 65 చిత్రంతో పాటు హిందీలో పలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
సినిమాల విషయం పక్కన పెడితే ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఫాలో అవుతుంది. ఏ విషయంలో..? అనేగా మీ డౌట్. సాధారణంగా పవన్కళ్యాణ్ ప్రతి ఏడాది తన తోటలో పండిన మామిడి పళ్లను టాలీవుడ్లో ప్రముఖులకు, తన స్నేహితులకు గిఫ్ట్గా పంపుతుంటారు.
అయితే ఇప్పుడు పూజా కూడా అదే చేస్తుంది. ఈ బ్యూటీకి మంగళూరులో మామిడి తోట ఉంది. అక్కడ పండిన పళ్లను గిఫ్ట్ హ్యాంపర్లలో ప్యాక్ చేసి.. టాలీవుడ్లోని స్నేహితులకు, దర్శకులు, నిర్మాతలకు పంపుతుందట. ఇక ఈమె మ్యాంగో ప్యాక్లను అందుకున్న వారు..పూజాను పొగడ్తలతో ముంచేస్తున్నారట.