ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గగా.. మరణాలు భారీగా పెరిగాయి.
గత 24 గంటల్లో భారత్లో 2,22,315 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,52,447 కు చేరుకుంది. అలాగే నిన్న 4,454 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,03,720 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 3,02,544 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 2,37,28,011 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 27,20,716 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశవ్యాప్తంగా నిన్నొక్కరోజే 19,28,127 మందికి కరోనా పరీక్షలు చేశారు.