ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో మలయాళ సూపర్ హిట్ అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో పవన్తో పాటు రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది.
ఈ భారీ మల్టీస్టారర్ ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే మలయాళంలో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఈ సినిమాలో పెడుతున్నారట. పవన్ క్రేజ్ కి తగిన విధంగా ఉండాలనే ఉద్దేశంతో.. ఆయన పాత్రకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను డిజైన్ చేశాడట దర్శకుడు.
అయితే వకీల్ సాబ్ సినిమాలో కూడా లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను యాడ్ చేశారు. కానీ, ఈ ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకులను కాస్త నిరాశకు గురిచేసింది. అనవసరంగా ఆ సీన్స్ పెట్టారంటూ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెడుతున్నారు. మరి ఇది ఎంత వరకు వర్కోట్ అవుతుందో చూడాలి.