కరోనా సెకెండ్ వేవ్ వచ్చాక సినీ పరిశ్రమలో ప్రతి రోజు ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటుంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటు రావడంతో.. తుదిశ్వాస విడిచారు.
ఆయన వయసు 62 సంవత్సరాలు. సినీ పీఆర్వోగా చిరపరిచితుడైన బీఏ రాజు దాదాపు 1500 సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు. భార్య బి.జయ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.చాన్నాళ్లపాటు సూపర్హిట్ అనే సినీ పత్రికను నడిపారు.
రాజు హఠాన్మరణంతో సినీ పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కాగా, బీఏ రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య జయ 2018లో కన్నుమూశారు.