చాలా మంది సినీ నటీనటులు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎప్పటి కప్పుడు తమ విషయాలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. కానీ ఆమీర్ ఖాన్, ఛార్మి లాంటి వారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నామని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు సల్మాన్ నటించిన దబాంగ్ 3 మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన వరీనా హుస్సేన్ కూడా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది.
కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు నేను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఫ్యాన్స్ ప్రేమ, అభిమానాలే నాకు బలం. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలని అనుకున్నాను. సోషల్ మీడియాలో ఇదే నా లాస్ట్ పోస్ట్ అని వరీనా పేర్కొంది. ప్రస్తుతం ఆమె పోస్టర్, ఇన్కంప్లీట్ మ్యాన్ చిత్రాల్లో నటిస్తోంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రంలోను ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.