`మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్.. ఆ వెంటనే స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన `కంచె` సినిమాతో ఆవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం మంచి హిట్ అయింది. దీంతో ఈ సినిమా తర్వాత ప్రగ్యా స్టార్ హీరోయిన్గా మారిపోతుందని అందరూ భావించారు.
కానీ, ఈ బ్యూటీకి కంచె చిత్రం తర్వాత సరైన హిట్టే లభించలేదు. ఇక కెరీర్ క్లోజ్ అవుతుంది అనుకున్న సమయంలో.. ఈ బ్యూటీకి బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
అయితే ప్రగ్యా ఆశలన్నీ బాలయ్యపైనే పెట్టుకుంది. ఎందుకంటే.. అఖండ సినిమా సూపర్ హిట్ అయితే తిరిగి ప్రగ్యా వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా సక్సెస్ పై ప్రగ్యా ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది.