సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి ప్ర‌భాస్‌..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌?!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర లెవ‌ల్‌లో వ్యాప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొన‌సాగుతున్నా.. క‌రోనా ఉదృతి ఏ మాత్రం ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే సామాన్యుల‌తో పాటు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండే సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే ఎంద‌రో సినీ తార‌లకు క‌రోనా సోక‌గా.. తాజాగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న చిత్రాల్లో `రాధేశ్యామ్‌` ఒక‌టి. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇంకా ఒక్క షెడ్యూలే మిగిలి ఉండ‌గా.. ప్రభాస్‌ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. ఆయన మేకప్‌మన్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

దీంతో రాధేశ్యామ్ లాస్ట్ షెడ్యూల్‌ను క్యాన్సిన్ చేసి..ప్రభాస్‌ సహా చిత్రబృందమంతా సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మిగిలిన్ షూటింగ్ పూర్తి చేయ‌నున్నార‌ట‌. అయితే ప్రభాస్ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్ల‌డంతో.. ఆయ‌న ఆరోగ్యంపై అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.‌