పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన రీఎంట్రీ చిత్రం `వకీల్ సాబ్` విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అదే సమయంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.
వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, బండ్ల గణేష్ ప్రొడక్షన్లో ఒక సినిమా, ప్రముఖ నిర్మాత జె.పుల్లారావు నిర్మాణంలో ఒక సినిమా పవన్ చేయనున్నారు. అర డజన్కు పైగా సినిమాలను లైన్ లో పెట్టిన పవన్..రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నాడట.
వకీల్ సాబ్కు సుమారు 55 కోట్లు రెమ్యునరేషన్ పుచ్చుకున్న పవన్.. హరి హర వీరమల్లు చిత్రానికి 15 కోట్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్కు 20 కోట్లు అడ్వాన్స్గా తీసుకున్నాడట. అలాగే హరీష్ శంకర్ సినిమాకు 30 కోట్లు రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో 50 శాతం వాటా, సురేందర్ రెడ్డి సినిమాకు 40 కోట్లు రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా తీసుకోనున్నాడట. ఇక నిర్మాత జె. పుల్లారావు నుంచి కూడా ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నారట పవన్. మొత్తానికి ఒక్కో సినిమా ఒక్కో రేటును తీసుకుంటూ పవన్ హాట్ టాపిక్గా మారాడు.