ఎక్కడో చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచదేశాలకు పాకేసి అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మునపటితో పోలిస్తే ప్రస్తుతం మరింత వేగంగా కరోనా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఎందరో కరోనా బారిన పడుతుండగా.. కొందరు ప్రాణాలను ఊడా కోల్పోతున్నారు.
తాజాగా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ కరోనాతో మృతి చెందారు. ఈయన వయసు 66 సంవత్సరాలు. ఇటీవల శ్రావణ్కు కరోనా సోకగా.. ముంబైలోని ఎల్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు.
అక్కడ చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. శ్రావణ్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచాడు. శ్రావణ్ మృతి బాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపులు. పలువురు గాయకులు మరియు సినీ తారలు శ్రావణ్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.