ప్రస్తుతం కరోనా వైరస్ ఊహించని రీతిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కాటుకు ఇప్పటికే ఎందరో ప్రాణాలు విడవగా.. మరెందరో హాస్పటల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు కరోనాను అంతం చేసేందుకు ప్రపంచదేశాల్లోనూ వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మహేష్.. ప్రజలకు ఓ విజ్ఞప్తి కూడా చేశాడు.
`నా కరోనా టీకా ఈ రోజు పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువుగా ఉంది. తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మే1వ తేదీ నుండి టీకా వేసుకోవడానికి అర్హులు. అందరూ టీకా వేయించుకోండి. సురక్షితంగా ఉండండి’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. కాగా, గత కొద్ది రోజుల నుంచి కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని మహేష్ వరుస ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేశాడు.