ఆ సూప‌ర్‌ హిట్ సినిమా రీమేక్‌లో చిరు-నాగ్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?

మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. వీరిద్ద‌రినీ ఒకే స్క్రీన్‌పై చూడాల‌ని మెగా మ‌రియు అక్కినేని అభిమానులు ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటున్నారు. అయితే ఆ క‌ల‌లు త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతున్నాట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద.

2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. రూ.100 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం ఇత‌ర భాష‌ల్లో రీమేక చేయ‌గా.. ఇక్క‌డ కూడా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగు రీమేక్ చేయ‌నున్నార‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున‌నాయి.

ఈ రీమేక్‌లో ర‌వితేజ‌- ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌నున్నార‌ని ప్రచారం జ‌రిగింది. అయితే ఇప్పుడు నాగార్జున‌, చిరంజీవి ఈ రీమేక్ చేసేందుకు ఒప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. చిరు, నాగ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కాబట్టి అన్నీ అనుకున్నట్టు కుదిరితే త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇదే నిజ‌మైతే ఫ్యాన్స్‌కు పండ‌గే అని అంటున్నారు.