రాధిక, శరత్ కుమార్ లకు జైలు శిక్ష …. ఎందుకంటే…?

చెక్ బౌన్స్ కేసులో సినీ ప్రముఖులు అయిన రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ కేసులో వారి పై నేరం నిరూపణ అయిన కారణంగా కోర్టు వారికీ ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పు ఇచ్చింది. శరత్ కుమార్, రాధిక గతంలో పలు చిత్రాలు నిర్మించారు. ఆ సినిమాల నిర్మాణ టైములో ఓ ప్రముఖ సంస్థ నుండి పెద్ద ఎత్తున రుణం పొందారు.

వారు తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వాలని ఆ సంస్థ ఒత్తిడి తీసుకురావటంతో, శరత్ కుమార్, రాధిక చెక్కు ఇచ్చారు. వారు ఇచ్చిన చెక్ బౌన్స్ కావటంతో సదరు సంస్థ వారి ఇరువురు పై కేసు పెట్టారు. ఈ కేసును విచారించిన చెన్నై స్పెషల్ కోర్టు బుధవారం ఇద్దరికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ప్రముఖ సినీ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వటం పై తమిళనాడులో పెద్ద చర్చనీయాంశమైంది.