క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ స్టార్ హీరో!

ప్ర‌పంచ‌దేశాల‌ను అల్లాడిస్తున్న ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.. త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ ప్ర‌తాపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. క‌రోనా సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డుతూ ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందులు పెడుతోంది.

ఈ క్ర‌మంలో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిప ప‌డుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌కు క‌రోనా సోకింది.ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ` ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. దాంతో ‌సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాను.

గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తాను.` అంటూ అక్షయ్ ట్వీట్ చేశారు. దీంతో ఆక్ష‌య్ త్వ‌ర‌గా రిక‌వ‌ర్ అవ్వాల‌ని అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు విష్ చేస్తున్నారు.