బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ తన భార్య కిరణ్ ఖేర్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కిరణ్ పలు చిత్రాల్లో నటించడంతో పాటు ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా కిరణ్ బ్లడ్ క్యాన్సర్తో ఉన్నారని అనేక వార్తలు వస్తున్నా క్రమంలో దీని పై అనుపమ్ తన ట్విట్టర్ ద్వారా అందరికి క్లారిటీ ఇచ్చారు.
కిరణ్ ప్రస్తుతం మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంతుంది త్వరలోనే కోలుకుని వస్తుందని చెప్పారు. కిరణ్ ను ప్రేమించే వారు చాలా మంది ఉన్నారు. మీ ప్రార్దనల వలన ఆమె అతి త్వరగా కోలుకుంటుంది. మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు అనుపమ్. కాగా, కిరణ్ ఖేర్ ప్రస్తుతం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పండితున్నారు.