టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ బాంగ్రా స్టెప్పులతో డాన్స్ అదరగొట్టాడు. యజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ధావన్ బాంగ్రా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ముందుగా ధావన్ బాంగ్రా డ్యాన్స్ను అనుసరిస్తూ ధనశ్రీ కూడా తనతో డ్యాన్స్ చేసింది. అయితే ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ పనుల్లో బిజీగా ఉండడంతో తాజాగా విడుదల చేసిన వీడియో పాతదని తెలిసింది. ఇంతక ముందు కూడా వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేసి నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఫామ్లోకి వచ్చిన ధావన్ ఐపీఎల్ 2021 సీజన్కు రెడీ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న ధావన్ నూతనోత్సాహంతో బరిలోకి దిగ బోతున్నాడు. కాగా ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో మూడు వన్డేలు కలిపి 169 పరుగులు చేసి, రెండు అర్థసెంచరీలు తీసాడు.