కరోనా బారిన పడ్డ భరత మహిళల క్రీడాకారిణి..!?

భారత మహిళల జట్టు టీ20 కెప్టెన్‌ హర్మన్ ‌ప్రీత్‌ కౌర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆమెకు జ్వరం రావడంతో సోమవారం పరీక్ష చేయించుకోగా కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో హర్మన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె బాగానే ఉంది అని, అతి త్వరలోనే కోలుకుంటారని అన్నారు. కాగా ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అడగా, ఐదు వన్డేల్లో కలిపి మొత్తంగా 160 పరుగులు చేసింది.

కానీ ఈ సిరీస్‌ను భారత్‌ 1-4 తేడాతో కోల్పోయింది. ఇక ఐదో వన్డేలో గాయపడిన హర్మన్‌ప్రీత్‌, సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు ఆమె దూరమయ్యారు. కాగా టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. అదే విధంగా పఠాన్‌ సోదరులు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌ కూడా ​కోవిడ్‌ బారిన పడ్డ విషయం తెలిసిందే.