నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముచ్చటగా మూడోసారి `బిబి3` వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్వా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది.
మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా నటిస్తున్నాడని ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా ఎంతో ఖర్చు పెట్టి తీశారు. దాదాపు ఆరు నిమిషాల పాటు సాగే ఎపిసోడ్ ఇది. అయితే షూటింగ్ పూర్తి అయిన తర్వాత బాలయ్య ఆలోచనలో మార్పు రావడం, ఆ ఆఅఘోరా ఎపిసోడ్ ని పక్కన పెట్టి, కొత్త సీన్లు రాసుకోవడం జరిగిందట.
అంతేకాదు, కొత్త సీన్ల షూటింగ్ కూడా బోయపాటి ఫినిష్ చేశాడని అంటున్నారు. అయితే బోయపాటికి మాత్రం అఘోరా ఎపిసోడ్ను సినిమాను పూర్తి తీసేయడం ఇష్టం లేదట. అందుకే ఆయన తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఆ అఘోరా ఎపిసోడ్ ని సినిమా అయిపోయిన తర్వత ఎండ్ టైటిల్స్ పడుతున్నప్పుడు చూపిద్దామని భావిస్తున్నారట. మరి అందుకు బాలయ్య ఒప్పుకుంటారా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.