దేశవ్యాప్తంగా సినీ జనాలు అందరూ ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తోన్న సినిమా 2.0. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా వచ్చే సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2010లో రజనీ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో సినిమాకు సీక్వెల్గా వస్తోన్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటికే ఎన్నో రికార్డులు తన పేరు మీద లిఖించుకుంటోంది. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్తో వస్తోన్న ఈ సినిమాపై స్కై రేంజ్లో అంచనాలు ఉన్నాయి.
ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ విలన్గా నటిస్తోన్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ను జీ నెట్వర్క్ రూ. 110 కోట్ల బారీ రేటుకు దక్కించుకుంది. ఇదే ఓ రికార్డు అనుకుంటే ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కూడా పెద్ద సంచలనంగా మారాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ 2.0 తెలుగు, తమిళ్ ఓవర్సీస్ రైట్స్కి రూ.105 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రేటుకి కనుక డీల్ ఓకే అయితే మాత్రం.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇదో ఆల్టైం రికార్డ్గా నిలిచిపోనుంది.
ఓ సౌత్ సినిమాకు ఈ రేంజ్లో ఓవర్సీస్ రైట్స్ ఏనాడు పలకలేదు. గతంలో బాహుబలి – ది కంక్లూజన్ సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇదే ఓ రికార్డు అనుకుంటే ఇప్పుడు 2.0 ఆ రికార్డును భారీ తేడాతో బద్దలు కొట్టి ఇండియన్ సినిమా హిస్టరీ పాత రికార్డులకు పాతరేసేలా ఉంది. షాక్ ఏంటంటే వీరి కాంబోలో వచ్చిన రోబో 2010లోనే ఏకంగా $ 12 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఇప్పుడీ చిత్రం $ 30 మిలియన్ మార్క్ వసూళ్లు రాబడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే నిర్మాత ఏకంగా రూ.105 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.
ఏఆర్.రెహ్మన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో రజనీ సరసన బ్రిటిష్ మోడల్ అమీజాక్సన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన విడుదల చేయాలని అనుకున్నా వీఎఫ్ఎక్స్ వర్క్ లేట్ అవ్వడంతో ఇప్పుడు వచ్చే సమ్మర్కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయనున్నారు.