ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులు పెద్ద వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ నంది అవార్డులు టాలీవుడ్లో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విబేధాలను భయటపెట్టడంతో పాటు ఏకంగా కులాల కుంపట్లకు కూడా తెరలేపింది. ఈ అవార్డుపై చాలా మంది విమర్శలు, కౌంటర్లు, రీ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ అవార్డులపై విమర్శలు చేసిన నిర్మాత బండ్ల గణేష్ ఈ అవార్డుల్లో కొన్ని తప్పులను ఎత్తి చూపుతున్నారు. వాటిని సరిచేయాలంటే ఇలా చేస్తే సరి అని బండ్ల కొన్ని డిమాండ్లను ఎత్తి చూపుతున్నారు. ఆ డిమాండ్లు ఇలా ఉన్నాయి.
బండ్ల తన డిమాండ్లలో ప్రధానంగా నాలుగు డిమాండ్లను ప్రస్తావిస్తున్నాడు.
– అక్కినేని నాగేశ్వరరావు ఉత్తమ కుటుంబ కథా చిత్రం కేటగిరి అవార్డును ప్రకటించాలి
– మనం సినిమాకు నాగేశ్వరరావుగారికి అవార్డు ఇవ్వాలి
– గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాకు పురస్కారం దక్కాల్సిందే
– రుద్రమదేవిలో నటించిన అల్లుఅర్జున్కు అవార్డు ఇవ్వాల్సిందే
తాను చేసిన ఈ సూచనలను పాటించి వీటికి అవార్డు ఇస్తే అందరికి న్యాయం జరిగినట్టే అని, లేనిపక్షంలో జ్యూరీ అర్హులకు అన్యాయం చేసినట్టే అవుతుందని బండ్ల ఆరోపిస్తున్నాడు. మరి బండ్ల సూచనలకు జ్యూరీ కమిటీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ? చూడాలి.