డ్రగ్స్ ఇష్యూలో సిట్ అధికారులు నిందితులకు షాకుల మీద షాకులు ఇస్తుంటే, ఈ నిందితుల జాబితాలో ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ అయితే మనకు షాకులు ఇస్తున్నాడు. ఓ వైపు ఇప్పటికే సిట్ పూరీని విచారించింది. ఇలాంటి కీలక కేసుల్లో ఎవరిని అయినా విచారణకు పిలిస్తే వాళ్ల గుండె ఆగిపోతుంది. పూరీ ఈ విషయంలో ఏం అవుతాడా ? అని అటు పూరీ అభిమానులతో పాటు ఇటు బాలయ్య అభిమానులు షాక్లో ఉంటే పూరీ మాత్రం రిలాక్స్గా ఉంటూ అందరికి వరుస షాకులు ఇస్తున్నాడు.
ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో బాలయ్య హీరీగా తెరకెక్కుతోన్న పైసా వసూల్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. సిట్ విచారణకు చాలా జాలీగా వెళ్లి వచ్చేసిన పూరి బ్లడ్ టెస్టు కూడా చేయించుకున్నాడు. అంత జరుగుతున్నా తన వృత్తి పరంగా సినిమాకు ఎక్కడా అన్యాయం చేయడం లేదు. పైసా వసూల్ షూటింగ్పై మాత్రం కాన్సంట్రేషన్ ఎక్కడా తగ్గించడం లేదు.
ఇక పైసా వసూల్ టీజర్ ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానుంది. దీని ఫైనల్ కట్ను కంప్లీట్ చేసిన పూరీ చిత్ర యూనిట్కు చూపించడంతో వాళ్లంతా అవాక్కైనట్టు తెలుస్తోంది. పూరీ గురించి తాము ఇంత టెన్షన్ పడుతుంటే, పూరీ కాన్ఫిడెన్స్ ఏంటో వాళ్లకు మాత్రం అర్థం కావడం లేదట.
ఇక పూరీ గత నాలుగు సినిమాల టీజర్లు, ట్రైలర్లు రొటీన్గానే ఉన్నాయి. ఇప్పుడు పైసా వసూల్ సినిమా టీజర్ ట్రైలర్ పాత వాటికి భిన్నంగా ఇరగదీసేలా ఉందన్న టాక్ రావడంతో ఇప్పుడు అందరూ పైసా వసూల్ టీజర్ ట్రైలర్ కోసమే ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా పూరి తన కాన్ఫిడెన్స్తో జనాలకు షాకుల మీద షాకులు ఇవ్వడం విచిత్రంగానే ఉంది.