దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు తెలుగు గడ్డ మీద అదిరిపోయే క్రేజ్ ఉంది. అనంత ఫ్యాక్షన్ రాజకీయాల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన రవీంద్ర చివరకు ఆ ప్రత్యర్థుల చేతుల్లోనే హతమయ్యారు. ప్రస్తుతం రవి భార్య సునీత ఏపీ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆమె తన తనయుడు శ్రీరామ్ను పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
రవికి ఉన్న క్రేజ్ను అంది పుచ్చుకుని కంటిన్యూ చేస్తోన్న శ్రీరామ్ ఇప్పటికే స్టేట్ రాజకీయాల్లో క్రేజీ ఐకాన్గా గుర్తింపు పొందడంతో పాటు అనంత రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక శ్రీరామ్ను ఎట్టకేలకు ఓ ఇంటివాడిని చేయాలని సునీత ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని నార్పల మండలానికి చెందిన ఓ ప్రముఖ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అధినేతతో శ్రీరామ్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని విశ్వసనీయవర్గాల సమాచారం.
సునీత తన తనయుడు శ్రీరామ్ కోసం ఎన్నో సంబంధాలు చూసినా తన కుటుంబంలో అణుకువగా ఉండే అమ్మాయి కోసం అన్వేషిస్తున్నారు. ఇక శ్రీరామ్ సైతం ఈ అమ్మాయిని ఓకే చేయడంతో పెళ్లి ఫిక్సయ్యింది. శ్రీరామ్ పెళ్లి ఫిక్సయ్యిందన్న వార్తలతో పరిటాల అభిమానులతో పాటు టీడీపీ అభిమానుల్లో ఎక్కడా లేని ఆనందం వ్యక్తమవుతోంది. ఇక ఈ పెళ్లిపై త్వరలోనే క్లారిటీ రానుంది.