తెలుగులో యాంటీ క్లైమాక్స్లను ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. యాంటీ క్లైమాక్స్ నేపథ్యంలో తెరకెక్కి ఇక్కడ హిట్ అయిన సినిమాలు చాలా తక్కువుగా ఉన్నాయి. అలా తీయడం చాలా క్లిష్టమైన విషయం కూడా. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ జై లవకుశ సినిమా క్లైమాక్స్ విషయంలో వస్తోన్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానులు చాలా టెన్షన్లో ఉన్నారు.
జై లవ కుశ చిత్రంలో జై.. లవ.. కుశ అంటూ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రల్లో ఎన్టీఆర్ జై పాత్రలో భయంకరమైన విలన్గా నటిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో సైతం ఎన్టీఆర్ నత్తితో డైలాగ్స్ చెపుతూ భయంకరంగా కనిపిస్తున్నాడు.
ఇక సినిమా క్లైమాక్స్లో కమర్షియల్ ఫార్ములా ప్రకారం జై రోల్ను మిగిలిన రెండు రోల్స్ అయిన లవ, కుశ చంపేస్తారట. అయితే ఇక్కడ చంపేది ఎన్టీఆరే రోల్స్ అయినా చచ్చిపోయే రోల్ చేస్తోంది కూడా ఎన్టీఆరే. తమ హీరో స్క్రీన్ పై చనిపోవడం అనే పాయింట్ ఫ్యాన్స్తో పాటు టాలవుడ్ సినీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరి బాబి క్లైమాక్స్లో మన కమర్షియల్ ఫార్ములా ప్రకారం విలన్ రోల్ అయిన జై రోల్ను చంపేస్తాడా ? లేదా క్లైమాక్స్ను ఎలా మారుస్తాడా ? అన్నది పెద్ద సస్పేన్సే. మరి బాబి దీనిని ఎలా డీల్ చేస్తాడో ? చూడాలి.