విజయవాడ పార్లెమంటరీ స్థానం.. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న స్థానం. అందునా ప్రస్తుతం రాజధాని ప్రాంతం ఈ నియజకవర్గంలో కలిసి ఉండడంతో మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత కేశినేని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన హయాంలోనే బెంజిసర్కిల్ వద్ద ప్లైవోర్కు పూజలు కూడా జరిగాయి. ఇక, దుర్గ గుడి వద్ద ఫ్లైవోవర్ నిర్మాణం వేగంగా సాగుతోంది. నాని ఎంపీ అయ్యాక, ఇక్కడ ఏపీ రాజధాని వచ్చిన పుణ్యమో, ఆయన కష్టపడిన పుణ్యమో విజయవాడ బాగా డవలప్ అవుతోంది. ఇది బాగానే ఉన్నా.. నాని నోరు మంచిది కాదనే వార్త హల్ చల్ చేస్తోంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం, ఆవేశ పడడం వంటి వి భారీ మైనస్లుగా కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే టీడీపీ అధినాయకత్వం నానిని దాదాపు పక్కన పెట్టేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి హొదాలో నారా లోకేష్ కేశినేనికి వార్నింగ్ ఇచ్చారని, నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించాడని తెలిసింది. అయినా కూడా నాని అవకాశం చిక్కినప్పుడల్లా రెచ్చిపోతూనే ఉన్నాడు. దీంతో లోకేష్.. నానిని పూర్తిగా పక్కన పెట్టి విజయవాడ ఎంపీ స్థానంలోని సమస్యలను తన దృష్టికే తేవాలని పార్టీకి నిర్దేశించారట.
ఈ పరిణామం గమనిస్తున్న వారు.. నానికి ఇక టీడీపీ మంగళం పాడిందనే గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ కృష్ణా జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. లోకేష్ ఈ నియోజకవర్గంపై ఇంతగా కాన్సంట్రేషన్ చేస్తున్నాడంటే.. దీని వెనుక 2019కి సంబంధించి ఏదైనా రాజకీయ వ్యూహం ఉండే ఉంటుందని అనుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో లోకేష్ భార్య బ్రాహ్మణిని పొలిటికల్గా రంగంలోకి దింపుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభం లో జరిగిన మహిళా పార్లమెంటులో మాట్లాడిన బ్రాహ్మణి.. అందరినీ ఆకర్షించింది కూడా. ఈ క్రమంలోనే ఆమె ను పొలిటికల్గా దింపేందుకు విజయవాడ ఎంపీ సీటును ఖాయం చేసుకున్నారని సమాచారం. బ్రాహ్మణి విజయవాడ కాని పక్షంలో గుంటూరు నుంచి అయినా బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి.
ఒక వేళ బ్రాహ్మణి గుంటూరుకు మారిన విజయవాడలో మాత్రం తనకు కావాల్సిన వాళ్లనే ఎంపీగా ఉంచుకోవాలన్నది లోకేశ్ ప్లాన్గా తెలుస్తోంది. అందుకే లోకేష్.. ఇప్పటి నుంచే విజయవాడ రాజకీయాల్లో అవగాహన పెంచుకుంటున్నాడని.. అందుకే ఇంతగా దృష్టి పెట్టాడని తెలుస్తోంది. సో.. నానికి నోరే చేటు తెస్తోందన్నమాట!! మరి రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.