షో మ‌ధ్య‌లో స‌మంత‌కు షాక్ ఇచ్చిన చైతు

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య రెండో సినిమా ఏ మాయ చేశావే సినిమాతో స్నేహితులుగా మారిన నాగచైతన్య, సమంత చాలా యేళ్ల‌పాటు ఎవ్వ‌రికి తెలియ‌ని సీక్రెట్ ప్రేమికులిగా మారారు. ఆ త‌ర్వాత వారిద్ద‌రు ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం సినిమాల్లో కూడా జోడీక‌ట్టారు. ఎట్ట‌కేల‌కు ఊరించి ఊరించి వారి ప్రేమ‌ను రివీల్ చేశారు. స‌మంత అక్కినేని ఇంట కోడ‌లిగా త్వ‌ర‌లోనే అడుగు పెట్ట‌నుంది.

ఇదిలా ఉంటే ఏ మాయ చేశావే సినిమాలో ఓ ఫేమ‌స్ డైలాగ్ ఉంది. ‘ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను’ అనే డైలాగ్‌నే స‌మంత‌కు ప్ర‌శ్న‌గా వేసి ఆమెకు షాక్ ఇచ్చాడు చైతు. చైతు తాజా సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. చైతు – ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో వీరిద్ద‌రూ బిజీబిజీగా ఉంటున్నారు.

తాజాగా ఓ ఛానెల్ లైవ్ ప్రోగ్రామ్‌కు చైత‌న్య – ర‌కుల్‌ప్రీత్‌సింగ్ వ‌చ్చారు. ఈ ప్రోగ్రామ్ మ‌ధ్య‌లో స‌మంత‌కు ఫోన్ చేసి ప్ర‌శ్న అడ‌గ‌మ‌ని చైతును రిక్వెస్ట్ చేశారు. వెంట‌నే చైతు స‌మంత‌కు ఫోన్ చేసి ‘ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను సామ్‌నే ఎందుకు ప్రేమించాను’ అన్న ప్ర‌శ్న వేశాడు.

వెంట‌నే చైతు ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇచ్చిన స‌మంత ‘ఎందుకంటే నేను నీకు ఇంకో ఆప్షన్‌ ఇవ్వలేదు’ అని చెప్పింది. దీంతో ‘నాకు ఇంకో ఆప్షన్‌ వద్దులే’ అనే చై చెప్పాడు. దీంతో ‘ఐ లవ్యూ’ అని చెప్పి కాల్‌ కట్‌ చేసింది సమంత. దీనిని బ‌ట్టి వీరిద్ద‌రి మ‌ధ్య ఎంత గాడ‌మైన ప్రేమ అల్లుకుందో అర్థ‌మ‌వుతోంది.