టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. మూడు వరుస హిట్ల తర్వాత రామయ్య అందాలు సినిమాతో ప్లాప్ ఎదుర్కొన్న రాజ్ గతేడాది మంచు విష్ణుతో ఈడోరకం – ఆడోరకం మల్టీస్టారర్ సినిమాలో చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజ్ ఈ శుక్రవారం కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అదే రోజు మంచు మనోజ్ గుంటూరోడు, విజయ్ దేవరకొండ ద్వారక సినిమాలు సైతం రిలీజ్ అవుతున్నాయి. ఇక చేసిన ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో రాజ్ తాజా సినిమాకు అదిరిపోయే రేంజ్లో బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమాకు రాజ్ కేరీర్లోనే హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇక ఓవర్సీస్ లో 57కు పైగా లొకేషన్స్ లో రిలీజ్ అవుతోంది. ‘యు/ఎ’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కూడా.. రాజ్ తరుణ్ ఇంతకు ముందు నటించిన చిత్రాలకంటే.. రికార్డు స్థాయి రేటులో అమ్ముడు పోయిందట.జెమినీ ఛానెల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను రూ.3 కోట్లకు దక్కించుకుందట. ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దొంగాట ఫేం వంశీకృష్ణ దర్శకత్వం వహించారు.