టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ – బాబాయ్ బాలయ్య మధ్య ఎంతోకొంత గ్యాప్ ఉందన్న వార్తలు తెలిసిందే. తాజాగా బాలయ్య తన 101వ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పట్టాలెక్కించేశాడు. గురువారం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ముందే చెప్పేశారు. సెప్టెంబర్ 29న దసరాకు సినిమా వచ్చేస్తుందని ప్రకటించారు.
ఈ ప్రకటనతో బాబాయ్ బాలయ్య అబ్బాయ్ ఎన్టీఆర్కు పరోక్షంగా ఓ మెసేజ్ పంపాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఎన్టీఆర్కు పంపింది మెసేజా ? లేక వార్నింగా ? అన్న మరో చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కళ్యాణ్రామ్ నిర్మాతగా బాబి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. జై లవ కుశ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేలా ముందు ప్లాన్ చేశారు.
ఇక బాలయ్య – పూరి సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 29గా షూటింగ్ ప్రారంభించిన రోజే ప్రకటించడం జూనియర్ సినిమాకు పరోక్షంగా ఇచ్చిన సందేశం అన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. తాము దసరాకు ముందుగానే వస్తున్నామని….ఎన్టీఆర్ సినిమా దసరాకు బరిలోకి ఉండవద్దని ఇది ఇన్డైరెక్టుగా చెప్పినట్లు ఉందని కూడా మరికొందరు అంటున్నారు.
మరి ఎన్టీఆర్ సినిమా సైతం అప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నాయి. మరి బాబాయ్ ప్రకటనతో అబ్బాయ్ వెనక్కు తగ్గుతాడా ? లేదా అదే టైంకు పోటీగా వస్తాడా ? అన్నది చూడాలి.