మ‌హేష్ చేతిలో బ‌క‌రా అయిన డైరెక్ట‌ర్

వంశీ పైడిప‌ల్లి టాలీవుడ్‌లో స‌క్సెస్ రేటు బాగానే ఉన్న డైరెక్ట‌ర్‌. బృందావ‌నం – ఎవ‌డు – ఊపిరి లాంటి మూడు వ‌రుస హిట్ల‌తో ఉన్న వంశీ పైడిప‌ల్లి ఇంకా త‌న కొత్త సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేదు. ఊపిరి హిట్ అయ్యి నెల‌లు గడుస్తున్నా ఇంకా వంశీ నెక్ట్స్ సినిమా విష‌యంలో క్లారిటీ లేదు. వంశీ పైడిప‌ల్లితో సినిమా విష‌యంలో ఓ ఇద్ద‌రు స్టార్ హీరోలు మాట ఇచ్చి తప్పార‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

ఊపిరి త‌ర్వాత అఖిల్ వంశీతో సినిమా ఉంటుంద‌న్న విష‌యంలో మాట మారిస్తే, ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఏకంగా వంశీని బ‌క‌రానే చేశాడ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. వంశీని మ‌హేష్ ఎలా బ‌క‌రా చేశాడు ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సినిమా మ‌హేష్ కేరీర్‌లోనే పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది.

ఈ సినిమాకు వ‌చ్చిన‌ నష్టాల్ని పూడ్చాలని బయ్యర్లు మహేష్ మీద, నిర్మాత పీవిపి మీద ఒత్తిడి తెచ్చారు. ఇందుకోసం నిర్మాత పీవీపీ, మ‌హేష్ ఇద్ద‌రూ క‌లిసి డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉంచేందుకు పీవీపీ బ్యాన‌ర్‌లోనే మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లితోనే సినిమా ఉంటుంద‌ని..ఆ సినిమా రైట్స్ బ్ర‌హ్మోత్స‌వం బ‌య్య‌ర్ల‌కే ఇస్తామ‌ని ఆశ చూపారు. దీంతో బ‌య్య‌ర్లు సైలెంట్ అయ్యారు. ఇక వంశీ ఆనందానికి అవ‌ధులే లేవు.

తీరా ఇప్పుడు మ‌హేష్ మురుగ‌దాస్ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ‌, ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్‌కు క‌మిట్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో బ్ర‌హ్మోత్స‌వం బ‌య్య‌ర్ల‌కు వంశీని బిస్కెట్‌గా వేసి మ‌నోడిని బ‌క‌రా చేశార‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. మ‌హేష్‌తో సినిమా అన‌గానే ఎగిరి గంతేసిన వంశీ ఇప్పుడు అస‌లు సంగ‌తి అర్థ‌మై బిక్క‌మొకం వేశాడ‌ట‌.