ఎన్టీఆర్ పాలిట విల‌న్‌గా మారిన మాజీ సీఎం

జ‌న‌తా గ్యారేజ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేదు. అటు టాలీవుడ్ సినీ జ‌నాలు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం చాలా ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్ప‌టికే చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు వినిపించినా ఇంకా ఎవ్వ‌రూ ఫైన‌లైజ్ కాలేదు.

ఇదిలా ఉంటే ఈ జాబితాలోనే ఓ ద‌ర్శ‌కుడి పేరు కూడా వినిపించింది. సినిమా ఫలితం మాట ఎలా ఉన్నా హీరోను స్టైలిష్‌గా ప్రెజెంట్‌ చేయడంలో దర్శకుడు సురేందర్‌రెడ్డిది ఓ ప్రత్యేకమైన స్టైల్‌. గ‌తంలో ఎన్టీఆర్ – సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో అశోక్ – ఊస‌ర‌వెల్లి సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు స‌క్సెస్ అవ్వ‌లేదు.

ఈ క్ర‌మంలోనే సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేసే విష‌య‌మై ఎన్టీఆర్ ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌. అయితే సురేంద‌ర్‌రెడ్డి మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా చేసే విష‌యంలో వెన‌క‌డ‌గు వేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. సురేంద‌ర్‌రెడ్డి ఎన్టీఆర్‌తో సినిమా చేయకుండా ఓ మాజీ సీఎం అడ్డుప‌డ్డార‌ట‌.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్‌ గౌడ రెండో సినిమాకు డైరెక్షన్‌ చేసే ఛాన్స్‌ సురేందర్‌కు వచ్చిందట. మొదటి సినిమా ‘జాగ్వార్‌’ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోవడంతో.. రెండో సినిమాపై దృష్టిపెట్టాడు నిఖిల్‌. ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ సురేంద‌ర్‌రెడ్డికి రాగా అందుకు సురేంద‌ర్ రూ.15 కోట్లు అడ‌గ‌గా వాళ్లు 13 కోట్ల రూపాయలు అందజేస్తామని నిర్మాతలు సురేందర్‌కు ఆఫర్‌ ఇచ్చారట. దీనికి వెంటనే ఆయన ఓకే చెప్పేశాడట. దీంతో ఎన్టీఆర్ – సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ప‌ట్టాలెక్కే ఛాన్సులు లేన‌ట్టే.