బాహుబలి అంటే రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది రిలీజ్ అయిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు కొల్లగొట్టి ఎన్నో సంచలనాలకు నిలయంగా మారిపోయింది. బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో ఇండియాను దాటేసి వరల్డ్వైడ్గా తెలిసింది. ఈ క్రెడిట్ మొత్తం దర్శకధీరుడు రాజమౌళికే చెందుతుంది.
అయితే ఈ బాహుబలికే దిమ్మతిరిగే షాకులు ఇస్తోంది మరో సౌత్ సినిమా. ఆ సినిమా కూడా మన తెలుగు సినియామే కావడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాల్లో ఏఆర్. మురుగదాస్-మహేష్ కాంబినేషన్లోని తెరకె్కుతున్న సినిమా సౌత్ ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తోంది.
టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కలిసి మొదటిసారి పనిచేస్తుండడంతో ఇటు తెలుగుతోపాటు అటు తమిళంలోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రూ.90 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ.150 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందన్న అంచనాలు ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ప్రారంభమయ్యాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా బాహుబలికే షాక్ ఇవ్వబోతోందని సమాచారం. ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులు, ఆడియో ఫంక్షన్ రైట్స్ కోసం ఓ ఛానల్ 18.5 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ బిగ్ డీల్ ఇప్పుడు తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలోను, టాలీవుడ్లోను పెద్ద ఆసక్తిగా మారింది.
టాలీవుడ్లో ఓ సినిమా శాటిలైట్ హక్కుల కోసం ఇంత భారీ మొత్తం చెల్లించడం అనేది ఇప్పటి వరకు లేదు. తెలుగు సినీ చరిత్రలోనే భారీ హిట్ అయిన ‘బాహుబలి’కి కూడా ఇంత మొత్తం దక్కలేదు. ఈ బిగ్ డీల్ను బట్టే ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టమవుతోంది. వచ్చే సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.