టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున బిజినెస్ లెక్కలే వేరు. టాలీవుడ్ అగ్ర హీరోలలో నాగార్జునకు ఉన్న బిజినెస్ మైండ్ ఇంకెవ్వరికి లేదన్న విషయం చాలా సందర్భాల్లో గతంలోనే రుజువైంది. అదంతా నాగ్ వ్యక్తిగత బిజినెస్కు సంబంధించింది కావడంతో ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు. అయితే తాజాగా నాగ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మలా కాన్వెంట్ అనే సినిమాను నిర్మించాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమాలో నాగ్ ఓ కీలక రోల్లో సైతం నటించాడు. ఇంత వరకు బాగానే ఉంది. ఈ సినిమాలో తాను నటించడంతో పాటు నిర్మాతగా కూడా ఉండడంతో ఆ బూచీ చూపించి బయ్యర్లకు భారీ రేట్లకు సినిమాను అమ్మేశాడు. బయ్యర్లు సైతం నాగ్ ఉండడంతో భారీ రేట్లకు నిర్మలా కాన్వెంట్ను కొనేశారు.
అన్ని ఏరియాల్లోను కలిపి ఈ సినిమాను రూ.10 కోట్లకు కొన్నారని…బయ్యర్ల నుంచి నాగ్కు భారీగా అడ్వాన్స్లు వచ్చాయన్నది భోగట్టా. ఇంత వరకు బాగానే ఉంది…సినిమా రిలీజ్కు ముందు ప్రమోషన్ తెగ ఊదరగొట్టేశారు. తీరా ఫస్ట్ షో పడిందో లేదో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఏపీ, తెలంగాణలో కలిపి కేవలం రూ 2.14 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన చూస్తే బయ్యర్లు ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడిలో 80 శాతం వరకు నష్టపోక తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక అదే టైంలో నాగార్జునపై సైతం విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నీరసనమైన కథలో ఏముందని నాగార్జున రోషన్ను హీరోగా పెట్టి సినిమా తీశాడు… నాగ్ రోల్ కేవలం బిజినెస్ కొరకే పెట్టినట్లు ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక సినిమా రిలీజ్కు ముందు ప్రమోషన్ల మీద ప్రమోషన్లతో ఊదరగొట్టిన నాగార్జున ఇప్పుడు సైలెంట్ అయిపోవడం గమనార్హం. ఇక బయ్యర్లు మాత్రం నిండా మునగడం ఖాయమైపోయింది.