లక్ష్మి తో చిందేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు చాలా అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ పుట్టునరోజు వేడుకులకు మెగాస్టార్ ఎక్కడా అభిమానులతో కలిసి హాజరవలేదు.మొత్తం అభిమానులతో వేడుకలంతా మెగా వారసులే దగ్గరుండి జరిపించారు.మెగాస్టార్ లేని లోటుని అభిమానులకి కనపడనీయకుండా రాంచరణ్,బన్నీ,వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్,అల్లు శిరీష్ తదితరులు పాల్గొంది మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

అయితే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు పార్క్ హయత్ హోటల్ లో చిరంజీవికి బాగా అత్యంత సన్నిహితుల మధ్య గ్రాండ్ గా సెలెబ్రేట్ చూసుకున్నారు మెగాస్టార్ చిరు.ఈ వేడుకకి హేమా హేమీలంతా హాజరయ్యారు.ప్రిన్స్ మహేష్ బాబు,మంత్రి కేటీర్ సహా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.అయితే ఈ వేడుక పార్క్ హయత్ హోటల్ లోపల ఎలా జరిగింది అన్నది ఇప్పటిదాకా బయటికి పొక్కలేదు.

అయితే తాజాగా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి షేర్ చేసిన ఒక ఫోటో పార్టీ ఏ రేంజ్ లో జరిగిందో చెప్తోంది.మంచు లక్ష్మి తో కలిసి చిరంజీవి ఎంతో హుషారుగా స్టెప్పులేస్తుండడం విశేషం.చిరు ఇంతకు ముందు కూడా బాలకృష్ణ,రవితేజ,నాగార్జున వంటి హీరోలందరితో కలిసి ఇంట్లోని ఓ ఫంక్షన్ కి హుషారుగా డాన్స్ చేసిన వీడియోలు మనం చూసాం.అందుకే చిరంజీవి బెస్ట్ హోస్ట్ అని అందరు అంటుంటారు.ఏదయినా పార్టీనో లేదా ఫంక్షనొ అరేంజ్ చేసాడంటే చిరు వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి ఏ ఇబ్బంది రానీయకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటాడట.అంతేనా వచ్చిన అతిధులను ఉత్సాహపరచడానికి స్టార్ డమ్ ని సైతం పక్కన పెట్టి చిన్నపిల్లాడిలా స్టెప్పులేయడం చూస్తే చిరంజీవి ది గ్రేట్ అని ఎవరైనా అనాల్సిందే.