కృతిసన్‌ని మళ్ళీ పిలుస్తున్నాడట

మురుగదాస్‌, మహేష్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమా కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు హీరోయిన్‌గా ఖరారైంది. అయితే ఇంకో హీరోయిన్‌కి ఈ సినిమాలో ఛాన్సుందట. ఆ ఛాన్స్‌ ‘1 నేనొక్కడినే’ ఫేం కృతి సనన్‌కి దక్కనుందని సమాచారమ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘1 నేనొక్కడినే’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా మహేష్‌ – కృతి పెయిర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇద్దరి మధ్యా స్క్రీన్‌పై కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. దాంతో మహేష్‌, కృతి ఇంకోసారి తెరపై ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసేందుకు రంగం సిద్ధమయ్యిందని సమాచారమ్‌. నాగచైతన్యతో ‘దోచెయ్‌’ సినిమాలో నటించింది ఈ పొడుగు కాళ్ల సుంద కృతి. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. దాంతో బాలీవుడ్‌ వైపు దృష్టి పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాల్ని కృతి దక్కించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. మహేష్‌ పుణ్యమా అని మళ్లీ టాలీవుడ్‌కి దారి మళ్లించేలా ఉంది.

అదే కనుక జరిగితే టాలీవుడ్‌లో ఆరడుగుల ఆజానుబాహులకు జోడీగా కృతిసనన్‌ అవకాశాలు దక్కించుకొనే ఛాన్సెస్‌ ఉన్నాయంటున్నాయి ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు. నటనలోనూ, డాన్సుల్లోనూ కూడా ఈ అమ్మడికి మంచి మార్కులే ఉన్నాయి. కానీ లక్కే కలిసి రావడం లేదు. మహేష్‌, మురుగదాస్‌ రూపంలో లక్‌ కలిసి వస్తే తన టాలెంట్‌ని చూపించడానికి మళ్లీ రెఢీ అంటోంది ఈ ముద్దుగుమ్మ కృతిసనన్‌.